Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రతి పక్ష నేత హోదా’పై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్..

  • అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ
  • విపక్ష హోదా కూడా దక్కని వైనం
  • ప్రతిపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోలేదన్న జగన్
  • ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే, తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా… కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు.

ఈ నేపథ్యంలో, జగన్ నేడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడంలేదని జగన్ ఆరోపించారు.

Related posts

మీ చిన్నారులు చదువుల్లో దూసుకుపోవాలంటే.. ఇవి ఇవ్వండి!

Drukpadam

ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా

Ram Narayana

పోడుభూముల సాగుదార్లకు ప్రభుత్వం రక్షణ : మంత్రి పువ్వాడ అజయ్!

Drukpadam

Leave a Comment