జాతీయ వార్తలుప్రమాదాలు ...

తమిళనాడులో గూడ్స్ రైలును ఢీకొట్టిన దర్భంగా ఎక్స్‌ప్రెస్!

  • తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధం
  • ఏసీ కోచ్‌లలోని 19 మందికి గాయాలు

తమిళనాడులో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్టై రైల్వే స్టేషన్ సమీపంలో దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి. దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళుతుంది.

ఈ ప్రమాదంలో దర్భంగాలోని 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదరుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి ఒకటి ఎక్కాయి. విషయం తెలియగానే ఘటనాస్థలికి పోలీసులు, ఇతర సహాయ సిబ్బంది, స్థానికులు చేరుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరూ మృతి చెందలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. గూడ్స్ రైలును ఢీకొన్న సమయంలో ముందు ఉన్న కోచ్‌లు అన్నీ ఏసీవే. ఈ కోచ్‌లలోని 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Related posts

ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల హతం

Ram Narayana

వైరా మండలం సోమవారం వద్ద కూలిన స్లాబ్ పోస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి…

Ram Narayana

వాయిదాల పద్ధతిలో గోల్డ్ లోన్ చెల్లింపులు.. ఆర్బీఐ ఆలోచన…

Ram Narayana