తెలంగాణ వార్తలు

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ

  • దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న మంద కృష్ణ
  • దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఉదయం రంగరాజన్‌ను కలిసిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ‘రామరాజ్యం’ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కొద్ది రోజుల క్రితం రంగరాజన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు.

నేడు మంద కృష్ణ మాదిగ… రంగరాజన్‌ను కలిసిన సందర్భంగా దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్చకుడిపై దాడి దారుణమని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దాడి ఘటనలో రంగరాజన్‌కు న్యాయం జరిగే వరకు ఆయనకు తోడుగా ఉంటామని ఆయన తెలిపారు. రంగరాజన్‌ను కలిసిన వారిలో మంద కృష్ణ మాదిగతో పాటు మాజీ ఎంపీ వెంకటేశ్ నేత తదితరులు ఉన్నారు.

అంతకుముందు, బీజేపీ నేత, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఈ ఘటన జరిగిన వెంటనే రంగరాజన్‌ను కలవలేకపోయానని, ఈరోజు కలిశానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో రంగరాజన్‌కు అండగా ఉంటామని ఆయన అన్నారు.

రంగరాజన్ ను పరామర్శించిన యాంకర్ శ్యామల

Anchor Syamala met Rangarajan
  • ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడి
  • ఈ ఘటనను వైసీపీ ఖండిస్తోందన్న శ్యామల
  • రంగరాజన్ కు అందరం అండగా ఉంటామని వెల్లడి

వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నేడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను కలిశారు. ఇటీవల దాడి జరగడం పట్ల ఆయనను పరామర్శించారు. రంగరాజన్ వంటి గౌరవనీయ వ్యక్తిపై దాడి జరగడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు శ్యామల తెలిపారు. మత సామరస్యం కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. అర్చకుల భద్రతకు సంబంధించిన ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎల్లప్పుడూ న్యాయానికి, ధర్మానికి అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేస్తున్నామని తెలిపారు. 

“రంగరాజన్ ఎలాంటి వారు ఆనేది చిలుకూరు ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి తెలుసు. ఆయన నాకు చాలాకాలం నుంచి వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఏ రోజూ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. అందరికీ స్వామి దర్శనం అందాలని కోరుకునే వ్యక్తి ఆయన. 

నడవలేని వాళ్లను చేతుల మీద మోసుకుంటూ తీసుకువచ్చి స్వామివారి దర్శనం చేయిస్తారు. అలాంటి వ్యక్తి మీద చేయి చేసుకోవాలని ఎలా అనిపించిందో అర్థం కావడంలేదు. రంగరాజన్ గారికి అందరం అండగా ఉంటాం” అని శ్యామల స్పష్టం చేశారు.

Related posts

జూబ్లీహిల్స్ లో మూగపోయిన మైకులు …నియోజవర్గంలో బయట వ్యక్తులు నో పర్మిషన్

Ram Narayana

బోరబండలో యువతి దారుణ హత్య…

Ram Narayana

గీత దాటితే వేటు తప్పదు…తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ ..!

Drukpadam