తెలుగు రాష్ట్రాలు

పాపికొండల యాత్రకు బ్రేక్..!!

పాపికొండల యాత్రకు బ్రేక్..!!

గోదావరి నదిలో విహారయాత్ర అదికూడా పాపికొండల నడుమ ,పేరంటాళ్ళ పల్లి వెళ్లి రావడం సరదా … రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు…ఇది దసరా ,దీపావళి సీజన్ లో అయితే మరి ఎక్కువగా ఉంటుంది …నడిపక్కన చిన్న చిన్న హాట్స్ వేసి అందులో చలి కాలం రాత్రిపూట బస చేయడం ఒక అనుభూతి ..అయితే జులై నెలలో గోదావరి విపరీతమైన వరదలు వస్తాయి…ఆసందర్భంగా పడవలు నడపటం నిషేదిస్తారు …దీంతో కొద్దీ రోజులపాటు పూర్తిగా విహార యాత్రకు బ్రేక్ పడుతుంది ..ప్రస్తుతం గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ జలవనరులశాఖ ఆదేశాలు జారీ చేసింది. వర్షంతోపాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ..నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యాత్ర ప్రారంభమయ్యే తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది.

Related posts

అధికారం శాశ్వతం కాదు, ప్రత్యర్థులను వేధించొద్దు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

Ram Narayana

రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన యాంకర్… నిప్పులు చెరిగిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Ram Narayana

కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ!

Ram Narayana