జాతీయ వార్తలు

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్…

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనకు కళ్లు తిరిగినట్టు అనిపించింది. దీంతో, ఆయనను హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. స్టాలిన్ ను ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆయన కుమారుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయనిధి కూడా ఆయన వెంట ఉన్నారు. మరోవైపు, స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా, అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ స్పందిస్తూ… ఆరోగ్యపరంగా స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఆయన లక్షణాలను పరిశీలించామని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు.

Related posts

ఉత్తరాఖండ్‌ లో కూలిన హెలికాప్టర్ … ఆరుగురు మృతి … మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి

Ram Narayana

పీఎఫ్ డబ్బు విత్‌డ్రా ఇప్పుడు చాలా ఈజీ.. మారిన నిబంధనలు ఇవే!

Ram Narayana

వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిజం పూర్తిగా అంతం: రాజ్‌నాథ్ సింగ్

Ram Narayana