ఖమ్మం వార్తలు

అంగరంగవైభవంగా బోనమెత్తిన రెడ్డిపల్లి …

అంగరంగ వైభవంగా ఆషాడ మాసం బోనాల పండుగ

ఖమ్మం రెడ్డి పల్లి గ్రామం మారెమ్మ గుడి ప్రాంతంలో ఆషాడ మాసం బోనాల పండుగను గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాలను మహిళలు భక్తి శ్రద్దలతో తయారుచేసి డప్పు వాయిద్యాలతో , మేళతాళలతో , నృత్యలతో ఊరేగింపుగా వెళ్లి మారెమ్మ దేవాలయంలో ఉన్న అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనాలతో మొక్కులు చెల్లించి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో , సిరి సంపదలతో , పాడిపంటలతో , సుఖ సంతోషాలుగా ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం ప్రధాన అర్చకులు రామశర్మ , గుర్రం పద్మ , నాగమణి , వరలక్ష్మి , రంగమ్మ , తీగల నాగమణి , అనుమల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన మంత్రులు తుమ్మల పొంగులేటి

Ram Narayana

ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ అగ్రగామిగా నిలవాలి …రాష్ట్ర వ్యవసాయమంత్రి తుమ్మల

Ram Narayana

పేదోడి ఇల్లు కంటే ‘కాళేశ్వరం’ కమిషన్లే ముఖ్యం అనుకున్నారు..!

Ram Narayana