జాతీయ వార్తలు

మోదీ విదేశీ పర్యటనలు.. మూడేళ్లలో రూ.295 కోట్ల ఖర్చు…

  • ఒక్క ఫ్రాన్స్ పర్యటనకే రూ.25 కోట్లు
  • ఇటీవలి ఐదు దేశాల పర్యటనకు రూ.67 కోట్లు
  • రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో మోదీ పర్యటనలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందనే వివరాలను ఆయన వెల్లడించారు.

2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.295 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటన (2025) కే రూ.25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ లో మోదీ అమెరికా పర్యటనకు రూ.22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోదీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం రూ.67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ ఏడాదిలో మోదీ మారిషస్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. అయితే, ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం మంత్రి వెల్లడించలేదు.

Related posts

ఆగస్టు 5 నుంచి అమెజాన్ లో ఆఫర్ల జాతర

Ram Narayana

రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, కేంద్రంపై విమర్శలు.. కాల్పుల విరమణ పొడిగించిన మావోలు!

Ram Narayana

ఐరాసలో పాక్‌కు కీలక పదవులు … ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం

Ram Narayana