Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో జర్నలిస్టుల ఇళ్లస్థలాల పై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చ …మంత్రి పార్థసారధి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంపై శనివారం అమరావతిలో జరిగిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించాం . ఈ విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి త్వరలోనే ముందుకు వెళతామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.

వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా, సహచర శాసనసభ్యుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం జగన్‌కు తగదని హితవు పలికారు.

శుక్రవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ గురించి, ఆయన ప్రవర్తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అలాంటి వ్యక్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఎలా చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. అనంతరం విశాఖ డేటా సెంటర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, జగన్ హయాంలో అదానీ డేటా సెంటర్ ఎందుకు ఏర్పాటు కాలేదని నిలదీశారు. ఆ సంస్థ ఏపీ నుంచి ఎందుకు వెనక్కి వెళ్లిపోయిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పార్థసారథి వెల్లడించారు. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలు చాలాచోట్ల నివాసయోగ్యంగా లేవని విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని లేఅవుట్లను రద్దు చేసి, లబ్ధిదారులకు 2 నుంచి 3 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే నిర్మాణాలు మొదలుపెట్టి పూర్తికాని వారికి కూడా ఇదే తరహాలో కేటాయింపులు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

తగిన జాగ్రత్తలతో స్కూళ్ల ను ప్రారంభించాలి-ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Drukpadam

ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎం నేత పోతినేని

Drukpadam

జగన్ లేఖ రాయగానే… 6.40 లక్షల టీకా డోస్ లు ఇచ్చిన కేంద్రం!

Drukpadam

Leave a Comment