హైద్రాబాద్ వార్తలు

హైద్రాబాద్ మెట్రో రైలు ఇకనుంచి ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ..

  • మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలిపిన సంస్థ
  • ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు
  • అన్ని టెర్మినళ్లలో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఈ నెల 3వ తేదీ నుంచి మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినళ్లలో, అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం కోరింది.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండటం వలన ఉద్యోగులు, విద్యార్థులు మరియు నగరవాసులు మెట్రో రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఎల్ అండ్ టీ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.

Related posts

న్యూయార్క్, టోక్యో నగరాలతో దీటుగా హైదరాబాద్…సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

మేయర్, డిప్యూటీ మేయర్‌‍పై అవిశ్వాస తీర్మానం… తలసాని శ్రీనివాస్

Ram Narayana

ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్.. ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం…

Ram Narayana