తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ జయంతి సందర్భంగా కోటి చీరెల పంపిణి …మంత్రి తుమ్మల

  • ఇందిరా గాంధీ జయంతిన ‘ఇందిరా మహిళా శక్తి చీరల’ పథకం ప్రారంభిస్తున్నామన్న మంత్రి తుమ్మల 
  • మహిళా సాధికారత, ఆత్మగౌరవమే లక్ష్యమన్న మంత్రి తుమ్మల 
  • రెండు విడతలుగా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు ఒక శుభవార్తను అందించింది. మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని ‘ఇందిరా మహిళా శక్తి చీరలు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

సమాజంలో మహిళల గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ ప్రగతిశీల పథకాన్ని తీసుకువచ్చిందని మంత్రి తుమ్మల తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కానుక అని ఆయన పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రెండు విడతలుగా చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. మొదటి విడతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు చీరలను అందజేస్తారు. ఇక రెండవ విడతలో పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

Related posts

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మెరుగుపడ్డ చిన్నారి శ్రీతేజ ఆరోగ్యం!

Ram Narayana

రైతు రుణమాఫీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ …ఇది కాంగ్రెస్ ఘనతే అంటున్న రేవంత్ రెడ్డి

Ram Narayana

రేపు వనదేవతల సమక్షంలోమేడారంలో మంత్రివర్గ భేటీ…

Ram Narayana