Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ ఇలాకాలో 200 మైనారిటీ కుటుంబాలు టీడీపీలో చేరిక1

  • పులివెందులలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
  • బీటెక్ రవి సమక్షంలో వేంపల్లిలో భారీగా చేరికల కార్యక్రమం
  • స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యమన్న బీటెక్ రవి

వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కడప జిల్లా వేంపల్లి మండల కేంద్రానికి చెందిన దాదాపు 200 మైనారిటీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ పరిణామం స్థానిక వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది.

పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ఆయన టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వేంపల్లి అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. గతంలో రిగ్గింగ్‌కు పాల్పడిన సతీష్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని బీటెక్ రవి స్పష్టం చేశారు. “మా కార్యకర్తలను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిపించే వరకు విశ్రమించను. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు సతీష్ రెడ్డికి లేదు,” అని ఆయన విమర్శించారు. ఈ తాజా చేరికలతో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలం మరింత పెరిగినట్లయింది.

Related posts

రూటు మార్చిన షర్మిల..! జగన్‌తో రాజీనా ..!!

Ram Narayana

టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Ram Narayana

చంద్రబాబు, నారా లోకేశ్ నాకు ఓటు వేయడం గర్వంగా ఉంది: ఆలపాటి రాజా

Ram Narayana

Leave a Comment