అంతర్జాతీయం

నలుగురు మయన్మార్ మాఫియా సభ్యులను ఉరితీసిన చైనా…

  • మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో శిక్ష అమలు
  • ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది ఉరిశిక్ష విధించిన కోర్టు
  • శిక్షను అమలు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడి

మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా నలుగురికి చైనాలో ఉరిశిక్ష అమలు చేశారు. ఈ మేరకు బాయి ఫ్యామిలీ మాఫియాకు చెందిన నలుగురికి ఉరిశిక్ష అమలు చేసినట్లు షెంజెన్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు వెల్లడించింది. హత్యలు, టెలికాం మోసం, డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది కోర్టు ఈ శిక్ష విధించింది. తాజాగా దానిని అమలు చేసింది.

ఆన్‌లైన్ మోసాలతో పాటు వివిధ కేసులు ఎదుర్కొంటున్న ఈ గ్యాంగులపై చైనా కొంతకాలంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మయన్మార్‌కు చెందిన నేర ముఠాకు చెందిన సభ్యులకు మరణశిక్షను అమలు చేసినట్లు ఇటీవల స్థానిక మీడియా పేర్కొంది.

వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ మాఫియా, తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలను తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ముఠాలోని నలుగురికి శిక్షను అమలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ శిక్షను ఎప్పుడు అమలు చేశారనేది తెలియరాలేదు.

Related posts

మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌!

Ram Narayana

అమెరికా రక్షణ మంత్రి విమానానికి తప్పిన పెను ప్రమాదం.. యూకేలో అత్యవసర ల్యాండింగ్

Ram Narayana

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. తదుపరి అధ్యక్షుడిగా దిస్సనాయకే!

Ram Narayana