జాతీయ వార్తలు

పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం..!

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓ వినూత్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ పోలింగ్ కేంద్రంలో ‘నీల’ అనే హ్యూమనాయిడ్ రోబో, సంప్రదాయ చీరకట్టులో ఓటర్లకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజాస్వామ్య పండుగకు సాంకేతికతను జోడించి ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రయోగంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కేంద్రానికి వచ్చే ఓటర్లకు ‘నీల’ రోబో చేతులు జోడించి నమస్కరిస్తోంది. ‘ఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అంటూ సందేశం ఇస్తూ వారిలో ఉత్సాహం నింపుతోంది. ఈ అనూహ్య పరిణామానికి ఓటర్లు, ముఖ్యంగా యువత ఆశ్చర్యపోయారు. చాలామంది ‘నీల’ రోబోతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.

ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు, ఓటర్లలో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేసింది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు.

Related posts

ఆపరేషన్ కగర్ కు వ్యతిరేకంగా నిరసనలు ..24 దేశ వ్యాపిత బంద్: మావోయిస్టు పార్టీ

Ram Narayana

2030 కామన్వెల్త్ గేమ్స్.. ఆతిథ్యం కోసం భారత్ అధికారిక బిడ్.. ఐఓఏ గ్రీన్ సిగ్నల్

Ram Narayana

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా విడుద‌ల‌.. టాప్‌లో తెలంగాణ‌!

Ram Narayana