Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓటర్లకు డబ్బులుకూడా ఇస్తాం …ఎమ్మెల్యే రాములు నాయక్…

ఓటర్లకు డబ్బులుకూడా ఇస్తాం …ఎమ్మెల్యే రాములు నాయక్
-ఏ బి సి డీ లుగా వర్గీకరించడని సూచన
-వారించిన రాష్ట్ర డీసీఎంస్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్
-భయం ఏమిలేదని సమర్ధన
– నాలుక కరుచుకొని ఖర్చులకు ఇస్తామని మాటమార్పు
-అవాక్కయిన నాయకులూ
-నవ్వుకున్నా సభికులు
పట్టభద్రల ఎన్నికలలో టీఆర్ యస్ పార్టీ డబ్బులు పంచుతుందనేందుకు వైరా ఎమ్మెల్యే వ్యాఖ్యలే నిదర్శనంగా నిలిచాయి. ఆతరువాత ఆయన ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాను ఖర్చులకు ఇస్తామని అన్నానని సమర్థుచుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగలిసిన డేమేజ్ జరిగిపోయింది. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన పట్టభద్రల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఓటర్లకు డబ్బులు కూడా ఇస్తాం ,ఆఫ్ ద రికార్డు ఎవరన్నా ఉన్నారా ? నగానే పక్కనే ఉన్న రాష్ట్ర డీసీఎంస్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ఆయన మాటలకూ బిత్తర పోయారు. వెంటనే వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే భయం ఏమిలేదు , కార్యకర్తలకు ఖర్చులకోసం ఇస్తాం అన్నారు. ఓటర్లను ఏ బి సి డి లు గా వర్గీకరించాలని అన్నారు. ఏ అంటే ఖచ్చితంగా ఓటు వేశారని ,బి అంటే కొంత అనుమానం అని , అంటూ తన మాటలను సమర్థించుకునే పని చేశారు . వేదికమీద ఉన్న బొర్రా రాజశేఖర్ తో పటు అందరు ఎమ్మెల్యే మాటలకూ అవాక్కు అయ్యారు . సమావేశానికి వచినవారందరు నవ్వుకున్నారు . అప్పటికే జరగలిసిన డేమేజ్ జరిగిపోయింది. నాలుక కరుచుకున్న ఫలితం ఏమిలేకుడా అంట రికార్డు అయింది . ఇక మీడియా పక్కన పెడితే సోషల్ మీడియా ఉందికదా సంఘటన విపరీతంగా వైరల్ అయింది . ఎమ్మెల్యేగారూ మాత్రం తాను అలా అనలేదని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Related posts

ఓటీ ఎస్ పై చంద్రబాబు ఆగ్రహం …సజ్జల వివరణ…

Drukpadam

నేను పోటీ చేయను.. పార్టీ కోసం పనిచేస్తాం: గుత్తా సుఖేందర్ రెడ్డి…

Drukpadam

ఇస్లామిక్ స్టేట్ వైపు ఆఫ్ఘన్ అడుగులు ….కఠిన నిబంధనలు ప్రజల ఆందోళన!

Drukpadam

Leave a Comment