Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

గుట్కా, పాన్ మసాలాపై పశ్చిమ బెంగాల్ కీలక నిర్ణయం…

  • గుట్కా, పాన్ మసాలాలపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన పశ్చిమ బెంగాల్ సర్కార్ 
  • ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు అని పేర్కొన్న వైద్య ఆరోగ్య శాఖ

గుట్కా, పాన్ మసాలా అమ్మకాలు, తయారీపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలాపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పొగాకు లేదా నికోటిన్‌తో తయారు చేసే గుట్కా, పాన్ మసాలా వంటి వాటిని తయారు చేసినా, అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా నేరంగా ప్రభుత్వం పరిగణించనుంది. 

నవంబర్ 7వ తేదీ నుంచి ఈ నిషేధం అమలు కానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ చట్టంలోని సెక్షన్ 30 స్టాండర్డ్స్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఈ ఆదేశాలలో పేర్కొన్నారు. 

Related posts

బెంగళూరు ఎయిర్ పోర్టులో 10 అనకొండలతో పట్టుబడ్డ ప్రయాణికుడు!

Ram Narayana

అప్పిస్తే జైలుకే: వడ్డీ వ్యాపారాలను నియంత్రించేందుకు కొత్త చట్టం ‘బులా’

Ram Narayana

ఇదిగో… తెలంగాణకు నిధులిచ్చాం!: లోక్ సభలో నిర్మలా సీతారామన్..

Ram Narayana

Leave a Comment