![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2022/08/6d32703a-c8ea-48f9-baf7-d41da180c9f9-32391-0000031a1ec47ac0_file-1024x768.jpg?resize=1024%2C768&ssl=1)
భట్టి పాదయాత్రకు విహెచ్ సంఘీభావం
75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కమాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ లు చేపట్టిన ఆజాదీ కా గౌరవ్ యాత్ర ఆరవ రోజు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని ఖాన్ ఖాన్ పేట నుంచి కల్లూరు క్రాస్ రోడ్, ఆర్కే పురం, టేకులపల్లి, పెనుబల్లి మండల కేంద్రం వరకు కొనసాగింది. టేకులపల్లి వద్దకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు విహెచ్ హనుమంతరావు భట్టి పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.
బోనాలతో మహిళల స్వాగతం
టేకులపల్లి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని భట్టి పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.