క్రైమ్ వార్తలు

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. కోర్టులోనే ముఖంపై యాసిడ్ పోసిన భర్త!

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. కోర్టులోనే ముఖంపై యాసిడ్ పోసిన భర్త!

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • కేసు విచారణకు కోర్టుకు వస్తుందని ముందే ఊహించిన భర్త
  • యాసిడ్ బాటిల్‌తో వచ్చి ముఖంపై దాడి
  • 80 శాతం గాయాలు.. నిందితుడి అరెస్ట్

ప్రియుడితో వెళ్లిపోయిన భార్యపై పగ పెంచుకున్న భర్త కోర్టు హాలులోనే ఆమె ముఖంపై యాసిడ్ పోశాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. లారీ డ్రైవర్ అయిన శివకుమార్, బాధిత మహిళ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో శివకుమార్ ఆమెపై పగ పెంచుకున్నాడు.

మరోవైపు, 2016లో ఓ చోరీ కేసులో అరెస్ట్ అయిన సదరు మహిళ ప్రస్తుతం బెయిలుపై బయట ఉంది. కేసు విచారణలో భాగంగా నిన్న ఆమె కోర్టుకు వచ్చింది. ఆమె వస్తుందని ముందే ఊహించిన శివకుమార్ పథకం ప్రకారం వెంట యాసిడ్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఆమె రాగానే బాటిల్‌లోని యాసిడ్‌తో ఆమెపై దాడిచేశాడు. ముఖంపై యాసిడ్ పడడంతో ఆమె నొప్పితో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయింది. అక్కడున్నవారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో ఆమెకు 80 శాతం గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. యాసిడ్ దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts

నల్గొండలో దారుణం.. ప్రేమ పేరుతో విద్యార్థినిపై అత్యాచారం.. రక్తస్రావంతో మృతి

Ram Narayana

రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి చేరుకున్న పోలీసులు

Drukpadam

‘కుర్ కురే’ చిచ్చు… కొట్టుకున్న రెండు కుటుంబాలు… 10 మందికి తీవ్ర గాయాలు

Ram Narayana