Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెరకు పార్లమెంట్ లో బిల్లు….

ఢిల్లీకి సంబంధించి ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది: అమిత్ షా

  • ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెరకు పార్లమెంట్ లో బిల్లు
  • ఇది దుర్మార్గం , కేంద్రం పెత్తనం తగదన్న విపక్షాలు
  • విపక్ష సభ్యుల అభ్యంతరాల మధ్య బిల్లు పెట్టిన కేంద్ర హోమ్ మంత్రి
  • ఇది రాజ్యాంగ బద్దమే అంటున్న అమిత్ షా..
  • ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన అమిత్ షా
  • బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు
  • రాజకీయ దురుద్దేశాలతోనే బిల్లును విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… ఢిల్లీకి సంబంధించి ఏ చట్టాన్నైనా తీసుకొచ్చే అధికారాన్ని పార్లమెంటుకు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. చట్టాన్ని తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని గతంలోనే సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. కేవలం రాజకీయపరమైన దురుద్దేశాలతోనే బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బిల్లును అనుమతించాలని స్పీకర్ ను కోరారు. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లును స్పీకర్ స్వీకరించారు.

ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లు. విపక్షాల ఆందోళన

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసే ఢిల్లీ అధికారాల ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవు.

 ఈ బిల్లును ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విపక్ష ఇండియా కూటమి పార్టీలు కేజ్రీవాల్ కు అండగా నిలిచాయి. బిల్లును అమిత్ షా సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం సభను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. 

Related posts

యువరాజు పట్టాభిషేకమా? -పార్టీలో పరిణామాలా ?

Drukpadam

మంత్రి కేటీఆర్ బండి సంజయ్ మధ్య వార్ …నల్లపిల్లి ..ఎర్రగడ్డ ఆసుపత్రి అంటూ విమర్శలు !

Drukpadam

ఎన్నికలంటే అందాల పోటీ కాదు: జైరాం రమేశ్!

Drukpadam

Leave a Comment