జాతీయ వార్తలు

అమర్త్యసేన్ మృతి చెందారంటూ వార్తలు, స్పందించిన కూతురు

  • తమ తండ్రి క్షేమంగానే ఉన్నారని చెప్పిన కూతురు నందనా దేబ్ సేన్
  • ఇలాంటి అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు
  • నిన్న సాయంత్రం వరకు తన తండ్రి తనతోనే ఉన్నారన్న కూతురు

ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందారంటూ వచ్చిన వార్తలపై ఆయన కూతురు నందనా దేబ్ సేన్ స్పందించారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, ఇలాంటి ప్రచారం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి ప్రచారాన్ని మానుకోవాలని నేను కోరుతున్నాను. మా తండ్రి బాగానే ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ప్రస్తుతం కొత్త పుస్తకంతో బిజీగా ఉన్నారు’ అని తెలిపారు.  

Related posts

ఎర్రకోట పేలుళ్ల కుట్ర.. ‘బిర్యానీ’ కోడ్‌వర్డ్‌తో బాంబుల తయారీ…

Ram Narayana

అమెరికాలో అదృశ్యమైన 22 ఏళ్ల కర్ణాటక విద్యార్థి

Ram Narayana

మన్మోహన్ కు కడసారి వీడ్కోలు పలికిన సోనియా!

Ram Narayana