Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన సీఎం జగన్

  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • జోరు పెంచిన వైసీపీ
  • పలు కీలక నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం

ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, వైసీపీ సన్నాహకాల్లో జోరు పెరిగింది. తాజాగా, రాష్ట్రంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఎం జగన్ నేడు ఇన్చార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయన పార్టీ పరంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో శ్రేణులను విజయవంతంగా నడిపించడం… ఈ అంశాలను ప్రాతిపదికగా చేసుకుని, ఆ మేరకు సామర్థ్యం ఉన్న వారిని ఇన్చార్జిలుగా నియమిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.

నియోజకవర్గం – ఇన్చార్జి పేరు

1. ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్
2. కొండేపి- ఆదిమూలపు సురేశ్
3. వేమూరు- వరికూటి అశోక్ బాబు
4. తాడికొండ- మేకతోటి సుచరిత
5. సంతనూతలపాడు- మేరుగు నాగార్జున
6. చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు
7. గుంటూరు (వెస్ట్)- విడదల రజని
8. అద్దంకి- పాణెం హనిమిరెడ్డి
9. మంగళగిరి- గంజి చిరంజీవి
10. రేపల్లె- ఈవూరు గణేశ్
11. గాజువాక- వరికూటి రామచంద్రరావు

కాగా, వీటిలో ప్రత్తిపాడు, కొండేపి, వేమూరు, తాడికొండ, సంతనూతలపాడు నియోజకవర్గాలను ఎస్సీ రిజర్వ్ స్థానాలుగా పేర్కొన్నారు.

Related posts

నా కోపం, ఆవేశం ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవి కావు: పవన్ కల్యాణ్

Ram Narayana

ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్.. 24 మంది మంత్రుల జాబితా విడుదల…

Ram Narayana

బి.జె.పి… కొత్త అర్థం చెప్పిన షర్మిల!

Ram Narayana

Leave a Comment