తెలంగాణ రాజకీయ వార్తలు ..

హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • నిన్న రేవంత్ రెడ్డితో ఇరవై నిమిషాలు సమావేశమైన జగ్గారెడ్డి
  • ఢిల్లీ పెద్దలను కలిసేందుకు నేడు రైలులో బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు లేదా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దాదాపు ఇరవై నిమిషాల పాటు సమావేశమైన జగ్గారెడ్డి… ఈ రోజు ఢిల్లీకి బయలుదేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రైల్లో ఢిల్లీకి బయలుదేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

త్వరలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. తన కూతురు లేదా భార్యకు రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానాన్ని ఆయన ఆశిస్తున్నారు. అదే సమయంలో తనకు ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవిని ఆయన కోరుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts

బీజేపీకి 30 సీట్ల వరకు వస్తాయి… సంకీర్ణ రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలి: ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపు

Ram Narayana

నాకు పదవిలేదు …పదవి కావాలి ..సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ …

Ram Narayana