తెలంగాణ రాజకీయ వార్తలు ..

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నియమించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

  • గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం  
  • కోదండరాం, అమరుల్లా ఖాన్‌లను నియమించిన గవర్నర్
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టిన కోదండరాం

గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్‌లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇంతలో గవర్నర్ కోటాలో కోదండరాం, అమరుల్లా ఖాన్‌లను తమిళిసై నియమించారు.

Related posts

ప్రతిష్టాత్మకంగా తుక్కుగూడ సభ ..లక్షలాదిగా తరలిరావాలి …మంత్రి తుమ్మల

Ram Narayana

ఖమ్మం కాంగ్రెస్ లో కిరికిరి ….ఆరు సీట్లు కావాలని పొంగులేటి పట్టు …

Ram Narayana

తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి: తంగళ్లపల్లి ప్రజలతో కేటీఆర్…

Ram Narayana