Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

సీఎం జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి…

  • జగన్ తరఫున నామినేషన్ వేసిన పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్
  • ఈ నెల 25న జగన్ స్వయంగా మరో సెట్ నామినేషన్ వేస్తారన్న మనోహర్ రెడ్డి
  • అనంతరం బహిరంగ సభకు హాజరవుతారని వివరణ

ఏపీ సీఎం జగన్ తరఫున ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇవాళ నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరఫున ఆయన చిన్నాన్న, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 

అనంతరం వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ తరఫున ఇవాళ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశామని, ఈ నెల 25న సీఎం జగన్ స్వయంగా వచ్చి మరో సెట్ నామినేషన్ వేస్తారని వివరించారు. 25వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని, అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. 

సీఎం జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. తొలివిడత బస్సు యాత్ర ముగిసిన అనంతరం నేరుగా పులివెందుల చేరుకుంటారు. ఏపీలో ఈ నెల 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది.

Related posts

అలాంటి వాళ్ల గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది: సజ్జల

Ram Narayana

పూతలపట్టు సభలో సీఎం జగన్ కు పాదాభివందనం చేసిన మంత్రి రోజా

Ram Narayana

చరిత్ర సృష్టించబోతున్నాం..ఐప్యాక్ టీంతో జగన్

Ram Narayana

Leave a Comment