క్రికెట్ వార్తలు

టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు ప్రకటన.. జట్టులో స్థానం ఎవరెవరికి దక్కిందంటే..!

  • 15 మంది ఆటగాళ్లు.. నలుగురు రిజర్వ్ ఆటగాళ్లతో జట్టు ప్రకటన
  • కెెప్టెన్ రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా
  • రిజర్వ్ ప్లేయర్ గా శుభ్ మన్ గిల్

త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో జట్టును అనౌన్స్ చేసింది. నలుగురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. టీమిండియా జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. రిషభ్ పంత్, సంజూ శాంసన్ లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేశారు. 

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. 

రిజర్వ్ ఆటగాళ్లు: శుభ్ మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్. 

Related posts

మూడో టీ20లో టీమిండియాదే విజయం… సిరీస్ లో ముందంజ

Ram Narayana

రికార్డుల రారాజు వైభవ్.. కానీ ఇప్పటికిప్పుడు టీమిండియాకు ఆడటం కష్టమే!

Ram Narayana

ఐపీఎల్ 2025 ఫైనల్ సరికొత్త చరిత్ర .. భారత్-పాక్ మ్యాచ్ రికార్డు బద్దలు!

Ram Narayana