Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపు బోణీ..!

  • గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా × ఐర్లాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 16 ఓవర్లలో 96 పరుగులకు ఐర్లాండ్ ఆలౌట్
  • 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా

రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయంతో టీ20 వరల్డ్ కప్ ప్రస్థానం ప్రారంభించింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. 97 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 36 పరుగులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. 

రోహిత్ శర్మ 4 ఫోర్లు, 3 సిక్సులు… పంత్ 3 ఫోర్లు, 2 సిక్సులు బాదారు. విరాట్ కోహ్లీ 1, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేసి అవుటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 1, బెంజమిన్ వైట్ 1 వికెట్ తీశారు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది.

Related posts

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్…

Ram Narayana

మూడో టీ20లో టీమిండియాదే విజయం… సిరీస్ లో ముందంజ

Ram Narayana

ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్.. మైదానంలోకి పోలీసుల ఎంట్రీ…

Ram Narayana

Leave a Comment