Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక!

  • సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్‌ కల్యాణ్‌
  • ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్న కూటమి నేతలు 
  • బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోవడం జరింగింది. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్‌ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్‌ ఆహ్వానం పలకనున్నారు. కాగా, బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఇక తనను ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనీలా తయారుకావాలి: జగన్

Ram Narayana

ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దర్యాప్తు అధికారి మార్పు వెనక పెద్ద రాజకీయ కుట్ర: ధూళిపాళ్ల నరేంద్ర

Ram Narayana

మాచ‌ర్ల‌లో వైసీపీకి ఎదురుదెబ్బ‌!

Ram Narayana

Leave a Comment