ఆంధ్రప్రదేశ్

ఏరా చెల్లెమ్మా… ఎలా ఉన్నారు..?

మహిళా కూలీలకు పొంగులేటి ఆప్యాయ పలకరింపు

ఎంవీ. పాలెం వద్ద కాన్వాయ్ ఆపి మాటా మంతి

ఖమ్మం రూరల్: ” ఏరా చెల్లెమ్మా.. ఎలా ఉన్నారు. పైరు బాగుంది. కలుపు తీస్తున్నారా..?” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఎంవీ. పాలెం గ్రామం సమీపంలో మహిళా రైతు కూలీలతో ఇలా మాట్లాడారు. ఆరెంపులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తనగంపాడు వెళుతూ.. ఇలా రోడ్డు వెంట ఓ పత్తి చేను వద్ద ఆగారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడుతూ.. సాగు ఎలా ఉంది..? సొంత భూమి నా..? కౌలుకు చేస్తున్నారా అంటూ.. ఆరా తీశారు. పిల్లలు ఏం చేస్తున్నారు.. బాగా చదివించండి.. మన ప్రభుత్వంలో అందర్నీ ఆదుకుంటాం.. అంటూ ఆప్యాయంగా భరోసా ఇచ్చారు. సాక్షాత్తూ మంత్రినే తమ వద్దకు వచ్చి ఇలా మాట్లాడటం తో.. ఆ మహిళలు ఎంతో ఆనందించారు.

Related posts

జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. సీపీ రంగనాథ్ పై ఆగ్రహం!

Drukpadam

బైకులు, కార్ల మధ్యలో గుర్రంపై దర్జాగా.. ఆరు పదుల వయసులో అదరగొట్టిన లక్ష్మారెడ్డి!

Ram Narayana

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు: షర్మిల

Ram Narayana