తెలంగాణ వార్తలు

ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షడ్యూల్!

ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షడ్యూల్!

సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు …ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం పర్యటన షడ్యూల్ విడుదల చేసింది …15 వ తేదీ గురువారం హైద్రాబాద్ లో 78 వ స్వతంత్ర దినోత్సవేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా 11 .45 గంటలు బయలుదేరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పుసుగూడం గ్రామం వద్దకు 12 గంటల 50 నిమిషాలకు చేరుకుంటారు … అక్కడే సీతారామ ప్రాజెక్ట్ పంపు హౌస్ ఫేస్ 2 ను ప్రారంభిస్తారు …పైలాన్ ఆవిష్కరణ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు … మధ్యాహ్నం 2 .15 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 2 .45 కు ఖమ్మం జిల్లాలోని వైరా చేరు కుంటారు …అక్కడ లక్షన్నర నుంచి 2 లక్షల రైతు రుణమాఫీ పాత్రలను రైతులకు అందజేస్తారు .. తర్వాత బహిరంగసభలో పాల్గొని సాయంత్రం 4 .45 గంటలకు వైరా నుంచి బయలుదేరి 6 గంటలకు బేగంపేట చేరుకుంటారని సీఎంఓ తెలిపింది ..

Related posts

విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్!

Ram Narayana

నల్ల బ్యాడ్జీలతో రంజాన్ ప్రార్థనలు చేసిన ముస్లింలు!

Ram Narayana

హైదరాబాద్‌లో ఉన్న భార్యపై లండన్ నుంచి భర్త విష ప్రయోగం

Ram Narayana