Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండైన విస్తారా విమానం!

  • 180 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరిన విస్తారా
  • సాంకేతిక సమస్యతో 20 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికుల తరలింపు

ఢిల్లీ వెళుతున్న ఓ విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 180 మంది ప్రయాణికులతో విస్తారా విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత అందులో సాంకేతిక సమస్య తలెత్తింది.

దీంతో ఆ విమానం గాల్లోనే ఇరవై నిమిషాల ఉంది. ఆ తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విస్తారా విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక లోపం రావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రయాణికులను మరో ప్రత్యేక విమానంలో తరలించారు.

Related posts

ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ.. 90 నిమిషాల పాటు నరకం

Ram Narayana

తొమ్మిదేళ్లుగా కడుతున్న బ్రిడ్జి… ముచ్చటగా మూడోసారి కూలింది…

Ram Narayana

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా విడుద‌ల‌.. టాప్‌లో తెలంగాణ‌!

Ram Narayana

Leave a Comment