తెలుగు రాష్ట్రాలు

తన దాడిలో గాయపడిన టీవీ రిపోర్టర్ ను పరామర్శించిన మోహన్ బాబు…

  • ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం
  • మోహన్ బాబు నివాసంలోకి ప్రవేశించిన మీడియా రిపోర్టర్లు
  • టీవీ9 రిపోర్టర్ రంజిత్ కుమార్ పై మోహన్ బాబు దాడి
  • ఆసుపత్రిలో చేరిన రిపోర్టర్
  • స్వయంగా కలిసి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు 

ఇటీవల ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం చెలరేగడం తెలిసిందే. ఈ క్రమంలో తన నివాసంలోకి ప్రవేశించిన మీడియా రిపోర్టర్లపై మోహన్ బాబు ఉగ్రరూపం ప్రదర్శించారు. టీవీ9 చానల్ రిపోర్టర్ రంజిత్ కుమార్ చేతిలోంచి మైక్ ను లాక్కున్న మోహన్ బాబు… ఆ మైక్ తో సదరు రిపోర్టర్ పై దాడి చేశారు. 

గాయపడిన రిపోర్టర్ రంజిత్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి రంజిత్ కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. 

ఆ రిపోర్టర్ కు క్షమాపణలు తెలియజేశారు. చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రిపోర్టర్ కుటుంబ సభ్యులతోనూ మోహన్ బాబు మాట్లాడారు. ఆ రోజు తన నివాసంలో జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

Related posts

తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ చేసిన టీటీడీ

Ram Narayana

యూనివ‌ర్సిటీల‌కు దేవుళ్ల పేర్లు ఎందుకు.. మ‌రోసారి కంచె ఐల‌య్య‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

Ram Narayana

అజ్ఞాతంలో మోహ‌న్ బాబు.. పోలీసుల గాలింపు…

Ram Narayana