తెలుగు రాష్ట్రాలు

సంధ్య థియేటర్ కేసులో నిందితుల జాబితా ఇదే!

  • ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం
  • ఏ-11గా అల్లు అర్జున్ పేరు
  • ఏ-12 నుంచి ఏ-17 మధ్య అల్లు అర్జున్ సెక్యూరిటీ టీమ్

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, ఏ-9, ఏ-10గా థియేటర్ సెక్యూరిటీ, ఫ్లోర్ ఇంఛార్జ్‌లను నిందితులుగా చేర్చారు. ఏ-12 నుంచి ఏ-17 వరకు అల్లు అర్జున్ బౌన్సర్లను, ఫ్యాన్స్ అసోసియేషన్ నేతను చేర్చారు.

తొక్కిసలాట కేసులో నిందితులు వీరే…

ఏ-1గా అగమాటి పెదరామిరెడ్డి (థియేటర్ ఓనర్), ఏ-2గా అగమాటి చిన్నరామిరెడ్డి (థియేటర్ ఓనర్), ఏ3గా ఎం.సందీప్(పార్ట్‌నర్‌), ఏ-4గా సుమిత్‌ (పార్ట్‌నర్‌), ఏ-5గా అగమాటి వినయ్ (పార్ట్‌నర్), ఏ-6గా అశుతోష్ రెడ్డి (పార్ట్‌నర్‌), ఏ-7గా రేణుకాదేవి (పార్ట్‌నర్), ఏ-8గా అరుణారెడ్డి (పార్ట్‌నర్), ఏ-9గా నాగరాజు (మేనేజర్), ఏ-10గా విజయ్‌చందర్ (లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్‌) ఉన్నారు.

ఏ-11గా అల్లు అర్జున్, ఏ-12గా సంతోష్ (అల్లు అర్జున్ పీఏ), ఏ-13గా శరత్ బన్నీ (అల్లు అర్జున్ మేనేజర్), ఏ-14గా రమేశ్ (సెక్యూరిటీ టీమ్), ఏ-15గా రాజు (సెక్యూరిటీ టీమ్), ఏ-16గా వినయ్ కుమార్(ఫ్యాన్స్ అసోసియేషన్), ఏ-17గా ఫర్వేజ్‌(బాడీగార్జ్), ఏ-18గా మైత్రీ మూవీస్ నిర్మాతలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Related posts

తెలంగాణ, ఏపీ రాజకీయాలపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందన

Ram Narayana

బనకచర్ల ప్రాజెక్టుపై తేల్చాల్సింది కేంద్రమే!:విశాఖలో భట్టి కీలక వ్యాఖ్యలు..

Ram Narayana