Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ఇంటర్‌పోల్‌!

పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్కడున్నారు? వారి గుర్తింపు? రహస్య ఆస్తులు తదితర సమాచారాన్ని పొందడానికి ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించింది. అధికారిక నేర పరిశోధనకు ముందు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం తదితర చర్యలను వేగవంతం చేయడమే దీని లక్ష్యం.ఇప్పటికే ఈ విషయాల్లో అంతర్జాతీయ సహకారం కోసం ఎంఎల్‌ఏ(మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌) ఒప్పందాలు, ఎల్‌ఆర్‌(లెటర్‌ రొగేటరీ)లను భారత్‌ వినియోగించుకుంటోంది. భారత్‌కు సుమారు 42 దేశాలతో ఎంఎల్‌ఏ ఒప్పందాలు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ను ఇతర దేశాలకు పంపడం ద్వారా ఆ దేశాల సహకారం పొందుతారు. ఈ విషయంలో తాజాగా 194 సభ్యదేశాలతో ప్రపంచ అతిపెద్ద అంతర్జాతీయ పోలీసు సంస్థగా ఉన్న ఇంటర్‌పోల్‌ సాయం తీసుకోవాలని ఐటీశాఖ నిర్ణయించింది.

Related posts

2024లో అత్యధికంగా సంపాదించిన భారతీయుడిగా గౌతమ్ అదానీ.. ఆస్తి ఎంత పెరిగిందంటే?

Ram Narayana

ఎస్ బీఐ కొత్త మ్యూచువల్ ఫండ్… రూ.250 నుంచి సిప్ ప్రారంభం…

Ram Narayana

పేటీఎం యాప్ లో మ‌రో కొత్త స‌ర్వీస్‌.. ఇక‌పై అగోడా హోట‌ల్ బుకింగ్స్ కూడా చేసుకోవ‌చ్చు!

Ram Narayana

Leave a Comment