జాతీయ వార్తలు

జగన్ ను కలిసిన నందీపుర పీఠాధిపతులు…

  • కర్ణాటకలోని నందీపురలో శ్రీ అర్ధనారీశ్వరస్వామి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
  • కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు
  • జగన్ ను కలిసిన నలుగురు పీఠాధిపతులు

వైసీపీ అధినేత జగన్ ను కర్ణాటక విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వీరు జగన్ ను కలిశారు. ఏప్రిల్ 30న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వరస్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ జగన్ కు పీఠాధిపతులు ఆహ్వానపత్రికను అందజేశారు. 

జగన్ ను కలిసిన వారిలో పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ (నందీపుర), పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్లి), జడేశ్వర తాత (శక్తిపీఠం, వీరాపుర), కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్, సండూర్) ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ చైతన్య, కో ఫౌండర్ వీరేశ్ ఆచార్య కూడా ఉన్నారు.

Related posts

కర్ణాటకలో కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు…

Ram Narayana

కోల్‌కతా ఘటనపై శ్రేయాఘోషల్ పాట… చప్పట్లు కొట్టకూడదని ఆడియన్స్‌కు విజ్ఞప్తి!

Ram Narayana

రేబిస్‌ మరణాల్లో భారత్‌ టాప్‌.. ప్రపంచంలో మూడో వంతు మన దేశంలోనే!

Ram Narayana