Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Ramasahayam Raghuram Reddy
ఖమ్మం వార్తలు

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తా

  • ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామస హాయం రఘురాం రెడ్డి
  • ఎంపీ లాడ్స్ తో మంజూరు చేసిన 8 ఫ్రీజర్ల అందజేత
  • రోగుల సౌకర్యార్థం రెండు బోర్లు వేయించేందుకు హామీ
  • దేవరపల్లి నేషనల్ హైవే నిర్మాణ పనుల పరిశీలన
  • 35 మందికి రూ.11.23 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి, రోగుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మార్చురీకి ఎంపీ లాడ్స్ రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన 8 ఫ్రీజర్లను అంద జేశారు. అనంతరం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను పరిశీలించారు. వైద్యాధికారుల విజ్ఞప్తి మేరకు, రెండు బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్య సిబ్బంది, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఫ్రీజర్ల కొరత ఉన్నట్లు తెలిసిందని, ఆయన సూచన మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఏర్పాటు చేయించానని చెప్పారు. ఆస్పత్రి పాత భవనం స్లాబ్ పెచ్చులు ఊడుతున్నాయని, మరమ్మతులకు నిధుల కేటాయించేందుకు కూడా కృషి చేస్తానని అన్నారు. తాను, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని హాస్పిటల్ తనిఖీకి తీసుకొస్తామని చెప్పారు. ఖమ్మం ఆస్పత్రికి ఎంతో పేరు ఉందని, గతంలో మహబూబాబాద్, తదితర దూర ప్రాంతాల నుంచి కూడా రోగులు వచ్చే వారని తెలిపారు. వైద్య చికిత్ పై ఫిర్యాదులు అందుతున్నాయని, ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలని అన్నారు. అనంతరం ఆయన ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేవరపల్లి నేషనల్ హైవే నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పొన్నెకల్ బ్రిడ్జి నుంచి ధంసలాపురం వరకు ఎన్ హెచ్ ఏఐ పీడీ దివ్యతో కలిసి తనిఖీ చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో 35 మందికి రూ.11.23 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీజ, అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు హరినాధ బాబు, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ బాబు రత్నాకర్ డాక్టర్ బి కిరణ్ ఉద్యోగ సంఘ నాయకులు నందగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

మమతా మెడికల్ కాలేజీకి కామ్రేడ్ పోటు ప్రసాద్ మృతదేహం డొనేట్!

Ram Narayana

ఖమ్మం జిల్లాలో మదన్ లాల్ ఇన్ రాములు నాయక్ అవుట్ …

Ram Narayana

రామసహాయం మాధవి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

Leave a Comment