konda Surekha
తెలంగాణ వార్తలు

మళ్లీ బాంబు పేల్చిన కొండా సురేఖ ?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఫైళ్లు క్లియరెన్స్ కోసం చాలా మంది మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరిగితోంది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సమంత, చైతుల డైవర్స్ పై ఆమె చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. వేముల వాడకు వెళ్లి.. అక్కడ స్వామి వారి నైవేద్యం ఆలస్యమయ్యేలా చేశారని వార్తల్లో కెక్కారు. మరో సారి ఏకంగా మంత్రి శ్రీధర్ బాబును .. తమ బంధువు కొడుక్కు ఐటీ జాబ్ ఇప్పించాలని స్టేజీ మీదనే అడిగిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా.. మంత్రి కొండా సురేఖ ఏకంగా ఫైళ్ల క్లియరెన్స్ లు, అనుమతులు మంజురు చేయడానికి చాలా మంది మంత్రులు డబ్బులు డిమాండ్ చేస్తారన్న మాటలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.

Related posts

రిజర్వేషన్లు 50 శాతం మించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్

Ram Narayana

హైదరాబాద్‌: రన్నింగ్ ఆటోలో డ్రైవర్ సరసాలు..!

Ram Narayana

నాపై నమోదైన అక్రమ కేసు కొట్టివేయండి: హైకోర్టులో మల్లారెడ్డి పిటిషన్

Ram Narayana