konda Surekha
తెలంగాణ వార్తలు

మళ్లీ బాంబు పేల్చిన కొండా సురేఖ ?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఫైళ్లు క్లియరెన్స్ కోసం చాలా మంది మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఆమె కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరిగితోంది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో సమంత, చైతుల డైవర్స్ పై ఆమె చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాయి. వేముల వాడకు వెళ్లి.. అక్కడ స్వామి వారి నైవేద్యం ఆలస్యమయ్యేలా చేశారని వార్తల్లో కెక్కారు. మరో సారి ఏకంగా మంత్రి శ్రీధర్ బాబును .. తమ బంధువు కొడుక్కు ఐటీ జాబ్ ఇప్పించాలని స్టేజీ మీదనే అడిగిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా.. మంత్రి కొండా సురేఖ ఏకంగా ఫైళ్ల క్లియరెన్స్ లు, అనుమతులు మంజురు చేయడానికి చాలా మంది మంత్రులు డబ్బులు డిమాండ్ చేస్తారన్న మాటలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.

Related posts

ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో!

Ram Narayana

అక్ర‌మ నిర్మాణాల‌పై నోటీసులు.. న‌టుడు అలీ ఏమ‌న్నారంటే..!

Ram Narayana

బీఆర్ఎస్ పార్టీలా కాదు.. మా పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు: మాణిక్ రావు ఠాక్రే..!

Drukpadam