జనరల్ వార్తలు ...

తవ్వకాల్లో బయట పడ్డ పురాతన బుద్ధుడి విగ్రహం

  • క్రీస్తుపూర్వం1, క్రీస్తు శకం3వ శతాబ్దాల మధ్య నాటిదని అంచనా

ఖమ్మం జిల్లాలో అరుదైన బుద్ధ విగ్రహం తవ్వకాల్లో బయట పడింది . చింతకాని మండలం నాగులవంచలో బయట పడిన అతి పురాతనమైన ఈ విగ్రహాన్ని పాలరాతితో చేసిన విగ్రహమని భావిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు కోలేటి నాగేశ్వర రావు వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో శనివారం  ఉపాధి హామి కూలీలు మట్టి తవ్వుతుండగా ఈ విగ్రహం బయట పడింది. అక్కడే మరో 2 శిలలను కూడా గుర్తించారు. ఆ ప్రాంతంలోనే గతంలో మట్టి కుండలు, పాత్రలు లభ్యమైనట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలియడంతో రెవిన్యూ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. విగ్రహాన్ని  రైతు పోలీసులకు అప్పగించాడు.  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు విగ్రహం బయట పడిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ఆ పురాతన  పాలరాతి బుద్ధ విగ్రహం క్రీ.పూ. ఒకటి- క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా వేశారు. 

Related posts

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు మళ్ళీ పొడిగింపు : మరో ఏడాది ఛాన్స్!

Ram Narayana

నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్‌డీ‌.. ఆశావహులకు యూజీసీ గుడ్‌న్యూస్!

Ram Narayana

స్నేక్ క్యాచర్ పాముతో సరసాలు…దానితోనే బలి…

Ram Narayana