ఆంధ్రప్రదేశ్

క్షణికావేశం.. కడపలో ఒకే ఇంట్లో నాలుగు మరణాలు!

  • కుటుంబ కలహాలతో కడపలో తీవ్ర విషాదం
  • ఏడాది కుమారుడితో కలిసి దంపతుల ఆత్మహత్య
  • గూడ్స్ రైలు కింద పడి ముగ్గురి దుర్మరణం
  • దిగులుతో ఇంట్లో నానమ్మ గుండెపోటుతో మృతి
  • ఒకే కుటుంబంలో నాలుగు మరణాలతో విషాదఛాయలు

కుటుంబంలో చెలరేగిన గొడవలు పెను విషాదాన్ని మిగిల్చాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఏడాది పసికందు సహా ముగ్గురి ఆత్మహత్యకు, ఆ దిగులుతో ఇంట్లో ఉన్న నానమ్మ మరణానికి దారితీసింది. ఈ హృదయ విదారక ఘటన కడప నగరంలో తీవ్ర కలకలం రేపింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
కడప నగరం శంకరాపురానికి చెందిన శ్రీరాములు (35), శిరీష (30) దంపతులు. వీరికి ఏడాది వయసున్న రుత్విక్‌ అనే కుమారుడు ఉన్నాడు. వీరు శ్రీరాములు నానమ్మ అయిన సుబ్బమ్మతో కలిసి జీవిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా శ్రీరాములు, శిరీష మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్బమ్మ వారిద్దరినీ మందలించారు.

నానమ్మ మందలించడంతో మనస్తాపానికి గురైన శ్రీరాములు, తన భార్య శిరీష, కుమారుడు రుత్విక్‌ను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మనవడు, మనవరాలు, మునిమనవడు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన సుబ్బమ్మ, ఆ దిగులుతో గుండెపోటుకు గురై ఇంట్లోనే ప్రాణాలు విడిచారు.

మరోవైపు, ఇంటి నుంచి వెళ్లిన శ్రీరాములు, శిరీష దంపతులు తమ కుమారుడితో కలిసి కడప రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి సుమారు 11 గంటల సమయంలో మూడో నంబర్‌ ట్రాక్‌పై వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో శంకరాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమేంటి? ఆత్మహత్య చేసుకునేంత తీవ్రమైన పరిస్థితులు ఎందుకు తలెత్తాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మనసున్న మారాజు కేసీఆర్ :గ్రానైట్ పరిశ్రమకు జీవం పోచారు గాయత్రీ రవి!

Drukpadam

పీపుల్స్ మార్చ్ లో భట్టికి వడదెబ్బ …మంగళవారం సాయంత్రం యాత్రకు బ్రేక్ …

Drukpadam

వాఘా స‌రిహ‌ద్దు వ‌ద్ద జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. తొలి సీజేఐగా రికార్డు!

Drukpadam