జాతీయ రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. వివాదం తర్వాత నేడు ఎన్నికల ప్రచారం…

  • కోల్‌కతా, సెరంపూర్‌లలో రెండు ఎన్నికల సభలు
  • మొదట అనుమతి నిరాకరించడంతో వాయిదా పడిన ర్యాలీలు
  • మమత పాలన వైఫల్యం వల్లే బీజేపీ ఎదిగిందన్న రాహుల్
  • రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా పడిన ఆయన సభలకు తాజాగా మార్గం సుగమమైంది. ఈ రోజు కోల్‌కతా, సెరంపూర్‌లలో రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.

వాస్తవానికి ఈ నెల 23న కోల్‌కతా, సెరంపూర్‌లలో రాహుల్ గాంధీ ర్యాలీలు జరగాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో అవి రద్దయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వ ఒత్తిడి వల్లే తమ సభలకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పరిణామంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత పెరిగింది.

అయితే, ఈ వివాదం కొద్దిసేపటికే సద్దుమణిగింది. ఏప్రిల్ 22న అధికారులు తాజాగా అనుమతులు మంజూరు చేయడంతో వాయిదా పడిన సభలను ఏప్రిల్ 25న నిర్వహించాలని నిర్ణయించారు. దీని ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కోల్‌కతాలోని చారిత్రక షహీద్ మినార్ మైదానంలో, ఆ తర్వాత హుగ్లీ జిల్లాలోని సెరంపూర్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు.

ఇటీవల తృణమూల్, బీజేపీలపై రాహుల్ గాంధీ విమర్శల దాడి పెంచారు. “మమతా బెనర్జీ స్వచ్ఛమైన పాలన అందించి, బెంగాల్‌ను విభజించకుండా ఉండుంటే, బీజేపీ ఇక్కడికి వచ్చేందుకు ఆస్కారమే ఉండేది కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న తొలి విడత పోలింగ్ ముగియగా, ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. 

Related posts

లోక్ సభ ఎన్నికలు… మహారాష్ట్రలో కీలక ప్రకటన చేసిన రాజ్ ఠాక్రే

Ram Narayana

మధురాంతకంలో మోదీ భారీ సభ.. తమిళనాడు ఎన్డీయేతోనే ఉంద‌న్న‌ ప్రధాని…

Ram Narayana

కేంద్ర ఆర్థికమంత్రికి ఎన్నికల్లో పోటీచేసేందుకు డబ్బులు లేవట …

Ram Narayana