ఆంధ్రప్రదేశ్

పల్నాడులో హైటెన్షన్.. మాజీ మంత్రి విడదల రజని గృహనిర్బంధం…

  • పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
  • మాచర్లకు వెళ్తారనే సమాచారంతో రజనిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు 
  • గురజాల సబ్ డివిజన్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు
  • జంట హత్యల కేసులో కోర్టు ఎదుట హాజరుకానున్న పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు కోర్టులో లొంగిపోనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి విడదల రజనిని చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో గృహనిర్బంధం చేశారు.

పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు విడదల రజని మాచర్ల వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు గురజాల సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు న్యాయస్థానం ఎదుట హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Related posts

ఈ కాలంలో తాగేందుకు ఎన్నో వెరై‘టీ’లు!

Drukpadam

అన్నంలా ఇసుకనూ భోంచేస్తున్నాడు.. 40 ఏళ్లుగా అదేపని!

Drukpadam

ప్రభుత్వ వైద్యుల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

Ram Narayana