అంతర్జాతీయం

నలుగురు మయన్మార్ మాఫియా సభ్యులను ఉరితీసిన చైనా…

  • మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో శిక్ష అమలు
  • ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది ఉరిశిక్ష విధించిన కోర్టు
  • శిక్షను అమలు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడి

మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా నలుగురికి చైనాలో ఉరిశిక్ష అమలు చేశారు. ఈ మేరకు బాయి ఫ్యామిలీ మాఫియాకు చెందిన నలుగురికి ఉరిశిక్ష అమలు చేసినట్లు షెంజెన్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు వెల్లడించింది. హత్యలు, టెలికాం మోసం, డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు ఆరుగురు చైనీయుల మరణానికి కారణమైనట్లు తేలడంతో గత ఏడాది కోర్టు ఈ శిక్ష విధించింది. తాజాగా దానిని అమలు చేసింది.

ఆన్‌లైన్ మోసాలతో పాటు వివిధ కేసులు ఎదుర్కొంటున్న ఈ గ్యాంగులపై చైనా కొంతకాలంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మయన్మార్‌కు చెందిన నేర ముఠాకు చెందిన సభ్యులకు మరణశిక్షను అమలు చేసినట్లు ఇటీవల స్థానిక మీడియా పేర్కొంది.

వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, జూద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ మాఫియా, తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలను తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలో ముఠాలోని నలుగురికి శిక్షను అమలు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ శిక్షను ఎప్పుడు అమలు చేశారనేది తెలియరాలేదు.

Related posts

కరోనా లాంటిదే… చైనాలో మరో వైరస్ గుర్తింపు!

Ram Narayana

కాంగోలో అంతుచిక్కని వ్యాధితో 143 మంది మృతి

Ram Narayana

లక్ష్యానికి చేరువయ్యాం .. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు

Ram Narayana