- ఆస్తి వివాదాల నేపథ్యంలో సజినిపై దాడి
- తనకు ప్రాణాపాయం ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- బీగ్రేడ్ సినిమాల ద్వారా అప్పట్లో గుర్తింపు పొందిన సజిని
ప్రముఖ నటి సజినిపై హైదరాబాద్లో దాడి జరిగింది. ఆస్తి వివాదాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేసే అవకాశం ఉందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడింది ఎవరు? వివాదం ఎవరితో నడుస్తోంది? అనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్కు చెందిన సజిని మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నటి షకీలాతో కలిసి బీగ్రేడ్ సినిమాల్లో నటించడం ద్వారా అప్పట్లో మంచి గుర్తింపు పొందారు. ఒకప్పుడు వెండితెరపై అలరించిన నటి, ఇప్పుడు ఆస్తి వివాదాల వల్ల ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.