ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
  • కవితను విచారిస్తున్న ఈడీ
  • మహిళలను కార్యాలయంలో విచారించడంపై సుప్రీంలో కవిత పిటిషన్
  • కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దన్న ఈడీ
  • ఆ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే ఈడీ కేవియెట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కవిత పిటిషన్ పై ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Related posts

విశాఖలో అట్టహాసంగా అంతర్జాతీయ నౌకాదళ ఉత్సవాలు…

Ram Narayana

పారిశుధ్య కార్మికుల మరణాలపై ఏపీ హైకోర్టు సీరియస్

Ram Narayana

బొత్స‌కు విద్య‌, రోజాకు ప‌ర్యాట‌కం.. ఏపీ మంత్రుల శాఖ‌లు ఇవే

Drukpadam