Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రాణాలు తీసిన ఆత్మీయసమ్మేళనం … ముగ్గురు మృతి పలువురికి గాయాలు…!

  • ప్రాణాలు తీసిన ఆత్మీయసమ్మేళనంముగ్గురు మృతి పలువురికి గాయాలు…!
    వైరా నియోజకవర్గ చీమలపాడు బీఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనంలోఘటన
    పేల్చిన బాణాసంచాగుడిశమీద పడ్డ నిప్పురవ్వలుపేలిన సిలిండర్
    ప్రజల మీద పడ్డ పేలిన సిలిండర్ శకలాలుతెగిపడ్డ కాళ్ళు చేతులు
    హాజరైన స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ , ఎంపీ నామ నాగేశ్వరరావు
    క్షతగాత్రులను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి
    క్షతగాత్రులకు పరామర్శించిన ఎంపీ నామ , ఎమ్మెల్యే రాములు నాయక్

ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు చేరువ అయ్యే కార్యక్రమాలు చేబడుతోంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్రమంలో ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములూ నాయక్‌ ఆధ్వర్యంలో కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన సమ్మేళనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది

పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. నిప్పు రవ్వలు పక్కనే ఉన్న గుడిసెపై పడ్డాయి. మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించి సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి ముగ్గురు మృతి చెందాడు. పలువురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్టు సమాచారం. వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మందికి కాళ్లు చేతులు విరిగిపడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదం అలముకుంది. అప్పటి వరకు నేతల రాకతో సందడిగా ఉన్న ప్రాంతం పేలుడు తర్వాత రక్తసిక్తమైంది.

Related posts

యూపీ ఎస్పీ నేత ఇంట్లో నోట్ల కట్టల లెక్క తేలింది… రూ.177 కోట్లు స్వాధీనం!

Drukpadam

బీజేపీకి 8 సార్లు ఓటేసిన యువకుడి అరెస్టు.. !

Ram Narayana

ఖమ్మం లో లేడీ కిలాడి … లాడ్జ్ లో మకాం చివరికి కటకటాలు

Drukpadam

Leave a Comment