Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

అంబటి రాయుడిపై అమరావతి రైతుల ఆగ్రహం

  • తుళ్లూరు మండలం వెలగపూడికి వెళ్లిన రాయుడు
  • తమ సమస్యలను వినాలని కోరిన అమరావతి రైతులు
  • మరోసారి వచ్చినప్పుడు వింటానన్న రాయుడు

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి నిరసన సెగ తగిలింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడికి ఈరోజు రాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు ఆయనను కలిశారు. అమరావతికి మద్దతు పలకాలని రాయుడిని కోరారు. తమ సమస్యలను వినాలని అభ్యర్థించారు. తమకు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, సమస్యలను వినాలని రైతులు కోరారు. అయితే తనకు సమయం లేదని, మీ సమస్యలను మరోసారి వింటానని చెపుతూ రాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాయుడుపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతల కోరిక మేరకు అంబటి రాయుడు అక్కడకు వెళ్లారు.

Related posts

వైరా గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా!

Drukpadam

సింగరేణిలో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మస్త్రంగా సీతక్క…

Drukpadam

బిగ్ బాస్ నిర్వాకులు హౌస్ మేట్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోండి :పూనమ్ కౌర్!

Drukpadam

Leave a Comment