ఆంధ్రప్రదేశ్రాజకీయ వార్తలు

అంబటి రాయుడిపై అమరావతి రైతుల ఆగ్రహం

  • తుళ్లూరు మండలం వెలగపూడికి వెళ్లిన రాయుడు
  • తమ సమస్యలను వినాలని కోరిన అమరావతి రైతులు
  • మరోసారి వచ్చినప్పుడు వింటానన్న రాయుడు

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడికి నిరసన సెగ తగిలింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం వెలగపూడికి ఈరోజు రాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు ఆయనను కలిశారు. అమరావతికి మద్దతు పలకాలని రాయుడిని కోరారు. తమ సమస్యలను వినాలని అభ్యర్థించారు. తమకు మద్దతు తెలపకపోయినా పర్వాలేదు, సమస్యలను వినాలని రైతులు కోరారు. అయితే తనకు సమయం లేదని, మీ సమస్యలను మరోసారి వింటానని చెపుతూ రాయుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాయుడుపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతల కోరిక మేరకు అంబటి రాయుడు అక్కడకు వెళ్లారు.

Related posts

23న సేవ్ జర్నలిజం డే-ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం

Drukpadam

ఆ డబ్బుతో కేసీఆర్ విదేశాలకు పారిపోతారు.. భూములు కొన్నవారు జాగ్రత్త: రేవంత్ హెచ్చరిక

Ram Narayana

ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ!

Drukpadam