Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముంబైలోని ఏడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురి మృతి

  • గోరేగావ్ ప్రాంతంలో ఘటన
  • పార్కింగ్ ప్రాంతంలో చెలరేగిన మంటలు
  • పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అగ్నికి ఆహుతి

ముంబైలోని గోరేగావ్‌లో ఈ తెల్లవారుజామున ఓ ఏడంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. భవనం వద్ద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

భవనం పార్కింగ్ ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పార్కింగ్ ప్రాంతంలోని ఓ బట్టముక్కకు మంటలు అంటుకుని ఆ తర్వాత ఆ ప్రాంతమంతా విస్తరించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సీబీఐపై ఝార్ఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

పుట్టినరోజు సందర్భంగా యాదాద్రీశ్వరుడికి కిలో బంగారం అందించిన మంత్రి అజయ్!

Drukpadam

ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి: గవర్నర్ ను కోరిన కూటమి నేతలు…

Ram Narayana

Leave a Comment