Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల

గెలుపు నాదే …రూ 400 కే సిలిండర్ …మహిళకు రూ 3 వేల పెన్షన్ …కందాల
ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం, అరేంపుల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం
బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి

ఈసందర్భంగా మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ గారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేశారన్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ గారి కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతినెల 3 వేల రూపాయకు అందిస్తామని, 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛను 6వేలకు, రైతుబంధును 16 వేలకు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా వర్తింప చేస్తామన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

నేను మంచి చేస్తాను అనే నమ్మకం ఉంటేనే నాకు ఓటు వేయండి,నా మంచితనాన్ని చూసి ఓటు వేయండి : కందాళ..

బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి గారు ఖమ్మం రూరల్ మండలం సీతారాంపురం, కొండాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పలు కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు

Related posts

తుమ్మలను పట్టించుకోని బీఆర్ యస్ …ఆయన చూపు ఎటు వైపు …?

Ram Narayana

కమ్యూనిజం అజేయం అజరామరం …సిపిఐ జాతీయనేత భాగం…

Ram Narayana

మంత్రి తుమ్మల ముందుచూపు … ఖమ్మంకు మహర్దశ…

Ram Narayana

Leave a Comment