Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తప్పుడు మాటలు మాట్లాడితే తాటతీస్తా …హీరోయిన్లతో సంబంధాల ఆరోపణలపై కేటీఆర్

నాకు ఏ హీరోయిన్ తోనూ సంబంధం లేదు

  • తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం
  • హీరోయిన్లను కేటీఆర్ బెదిరించారంటూ ఆరోపణలు
  • తప్పుడు మాటలు మాట్లాడితే తాట తీస్తామన్న కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో సినీ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత వైవాహిక జీవితం విచ్ఛిన్నమయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

ఈ అంశంపై ఈరోజు తెలంగాణ భవన్ మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఫోన్లు ట్యాప్ చేసి తాను హీరోయిన్లను బెదిరించానని ఇటీవల ఓ మంత్రి అన్నారని… ఇలాంటి అసత్య ఆరోపణలు చేసేవారిని తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. చెత్త మాటలు మాట్లాడితే మంత్రి అయినా, సీఎం అయినా తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. 

ఏ హీరోయిన్ తోనూ తనకు సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన క్యారెక్టర్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం తనకు ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ తనకేముందని అన్నారు. తప్పుడు ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.

క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ రేట్లు తగ్గించట్లేదేం?: మోదీని నిలదీసిన కేటీఆర్

  • ప్రతీ భారతీయుడూ దీనిపై ఆలోచించాలని కోరిన మాజీ మంత్రి
  • 2014 నుంచి ఇప్పటి వరకు క్రూడాయిల్ ధర 20 డాలర్లు తగ్గిందని వివరణ
  • కొండెక్కిన పెట్రోల్ రేటు మాత్రం కొంచెం కూడా తగ్గలేదని మండిపాటు
  • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన కేటీఆర్
Every Indian needs to think about this Asks KTR

ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి విలువ పడిపోతే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారని, ఆ పాపమంతా కేంద్రానిదేనని ట్వీట్ చేశారని గుర్తుచేశారు. అప్పట్లో మోదీ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు. మరి ఇప్పుడు.. గత పదేళ్లుగా ప్రధాని సీట్లో కూర్చుని మోదీ చేసిందేంటని నిలదీశారు. 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉండె.. ఇప్పుడు ఎలా ఉన్నాయంటూ రేట్ల పట్టికను ట్వీట్‌ చేశారు. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండేవని, మోదీ పదేళ్ల పాలనలో నేడు చమురు ధరలు దిగొచ్చినా సరే కొండెక్కిన పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అలానే ఉన్నాయని ఆరోపించారు.

గడిచిన దశాబ్దంలో పెట్రోల్ ధర రూ.35, డీజిల్ ధర రూ.40 వరకు పెరిగిందని చెబుతూ దీనికి బాధ్యులెవరని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెరగడానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటూ నిలదీశారు. 2014 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.72.26, డీజిల్ ధర రూ.55.49, క్రూడ్ ఆయిల్ ధర 105.56 డాలర్లు ఉండేవని, ప్రస్తుతం 2024 ఏప్రిల్ 2న పెట్రోల్ ధర రూ.107.41, డీజిల్ ధర రూ.95.65, క్రూడ్ ఆయిల్ ధర 86.44 డాలర్లు ఉందని కేటీఆర్ చెప్పారు. ఇక, గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పట్లో మోదీ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ.. రూపాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉందని, రూపాయి విలువ పడిపోవడానికి కేంద్ర ప్రభుత్వ అవినీతే కారణమని మోదీ చెప్పారన్నారు.

Related posts

ఫాంహౌస్ లో తీవ్ర భావోద్వేగం… కవితను ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్

Ram Narayana

ఆ నెటిజన్ ఆలోచనతో ఏకీభవిస్తున్నా: కేటీఆర్

Ram Narayana

ఆశించిన వారందరికీ టిక్కెట్ ఇవ్వలేం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Ram Narayana

Leave a Comment