జాతీయ రాజకీయ వార్తలు

యూపీలో 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర…

  • యూపీలో బీజేపీకి మించి సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి
  • తమను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయం
  • మొత్తం 403 నియోజకవర్గాల్లోనూ యాత్ర

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని సమాచారం. 

ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకోగా, మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

Related posts

ఏపీలో చంద్రబాబు ..కేంద్రంలో మోడీ బల్లగుద్ది చెపుతున్న ప్రశాంత్ కిషోర్…

Ram Narayana

బెంగళూరులో ప్రధానికి స్వాగతం పలకకపోవడంపై డీకే శివకుమార్

Ram Narayana

ప్రియాంక గాంధీ తరపున వయనాడ్‌లో మమతా బెనర్జీ ప్రచారం!

Ram Narayana