జాతీయ వార్తలు

ఢిల్లీలో ముగిసిన కేంద్రం అఖిలపక్ష భేటీ…


రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, నేడు ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీ ముగిసింది. పార్లమెంటు అనెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం సుదీర్ఘ సమయం పాటు సాగింది. 

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం విపక్షాలను కోరింది. బడ్జెట్ తో పాటు, పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కూడా కేంద్రం విపక్షాలకు అందించింది.

కాగా, రేపు ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో… విపక్షాలు నీట్ పరీక్ష వివాదం, మణిపూర్ హింస, ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.

Related posts

టెర్రర్‌ కేసు దోషితో తల్లి పెళ్లి.. తనయుడిని ఉగ్రవాదిగా మార్చేందుకు యత్నం…

Ram Narayana

ప్లీజ్.. గొడవ పడడం ఆపండి: మైతేయిలు, కుకీలకు మణిపూర్ ముస్లింల విజ్ఞప్తి

Ram Narayana

మావోల్లో అలజడి …ఆయుధాలు వీడాలని ఒక వర్గం …వద్దని మరో వర్గం

Ram Narayana